భారతదేశం, మే 26 -- మీర్జాపూర్ ఫేమ్ అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలో 'స్టోలెన్' చిత్రం తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీకి తేజ్‍పాల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే కొన్ని ఫిల్మ్ ఫెస్టివళ్లలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. ప్రశంసలు దక్కించుకుంది. అయితే, ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

స్టోలెన్ సినిమా జూన్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ నేడు (మే 26) అధికారికంగా వెల్లడించింది. "ఓ తప్పిపోయిన బాలిక. కాలానికి ఎదురెళ్లే థ్రిల్లింగ్ రేస్. జూన్ 4న ప్రైమ్‍లో స్టోలెన్" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అభిషేక్ బెనర్జీకి గాయాలైనట్టుగా ఓ పోస్టర్ రివీల్ చేసింది.

స్టోలెన్ చిత్రం వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శితమై మంచి గుర్త...