భారతదేశం, ఫిబ్రవరి 6 -- బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో ఒకరైన షనాయా కపూర్, విక్రాంత్ మాస్సే సరసన 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

అలాగే, గతేడాది సెప్టెంబర్ 5 నుంచి జీ5లో ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఇలా బాక్సాఫీస్, ఓటీటీల్లో తన మొదటి సినిమా ఫెయిల్యూర్ కావడంపై షనాయా కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంపై షనాయా స్పందిస్తూ.. "నా సినిమా చూసేందుకు థియేటర్లు నిండిపోవాలన్నది నా కల. కానీ, నా మొదటి సినిమా విషయంలో అది జరగలేదు. అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పటికే నేను న...