భారతదేశం, ఫిబ్రవరి 3 -- హైదరాబాద్‌కు చెందిన ఎంఈఐఎల్ (MEIL) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను సంస్థ ఆమోదించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు పలు కీలక ప్రకటనలు చేశారు.

సాంకేతిక విప్లవం: బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ భారత ఎలక్ట్రిక్ బస్సుల రంగంలోనే తొలిసారిగా ఒలెక్ట్రా అభివృద్ధి చేసిన 'బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌'కు సర్టిఫికేషన్ లభించింది. "ఈ టెక్నాలజీ మా వృద్ధి వ్యూహంలో కీలక మైలురాయి. వచ్చే త్రైమాసికం నుంచే బ్లేడ్ బ్యాటరీతో కూడిన కొత్త బస్సుల ఉత్పత్తిని ప్రారంభిస్తాం" అని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సాంకేతికత వల్ల బస్సులు మరింత సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేస్తా...