భారతదేశం, ఫిబ్రవరి 6 -- పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మూవీ ధురందర్. గతేడాది చివర్లో విడుదలైన ఈ ఆదిత్య ధర్ మూవీ బాలీవుడ్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. మొదటి భాగం సృష్టించిన ఈ సంచలనం.. ఇప్పుడు దాని సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' (Dhurandhar 2) మీద అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఎంతలా అంటే ఈ సినిమా ఒక్క టికెట్ కూడా ఇంకా అమ్మకముందే నిర్మాతలకు రూ.250 కోట్ల లాభాలు రావడం విశేషం.

సాధారణంగా సీక్వెల్స్‌కు డిమాండ్ ఉండటం సహజమే. కానీ 'ధురంధర్ 2' విషయంలో అది పదింతలు పెరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి భాగానికి, రెండో భాగానికి జరిగిన బిజినెస్ వ్యత్యాసం చూస్తే మతిపోతుంది.

మొదటి భాగం మ్యూజిక్ రైట్స్ సరిగమ సంస్థ కేవలం రూ. 20 కోట్లకు దక్కించుకుంది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండో భాగం ఆడియ...