భారతదేశం, ఫిబ్రవరి 1 -- పర్యావరణ పరిరక్షణ- సాధికారత లక్ష్యంగా మహిళలకు ఇ-సైకిళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో 5555 సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసి కుప్పం నియోజకవర్గం. గిన్నీస్ వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇ-సైకిళ్లను ఇంత పెద్ద సంఖ్యలో పంపిణీ చేయటంపై ఈ రికార్డు నమోదు అయినట్టు గిన్నీస్ వరల్డ్ బుక్ అజుడికేటర్ ప్రకటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సైకిళ్ల తయారీ సంస్థ ఇ-మోటరాడ్ ప్రతినిధులకు శనివారం సర్టిఫికెట్ అందించారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇ- సైకిళ్లకు 'సూపర్ సైకిల్' అని పేరుపెట్టినట్టు సీఎం వివరించారు. 60 కిలోమీటర్ల వరకూ సైకిల్ పైనే ప్రయాణించి...