భారతదేశం, ఫిబ్రవరి 4 -- 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'వారణాసి' అనే టైటిల్ ఖరారైన విషయం తెలిసిందే. తాజాగా 'స్క్రీన్ రాంట్ ప్లస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ కాలంలో ప్రేక్షకుల ఏకాగ్రత సమయం తగ్గిపోతోందని.. రీల్స్, షార్ట్ వీడియోలకు అలవాటు పడుతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'వారణాసి' రన్‌టైమ్ సుమారు 3 గంటలు ఉంటుందని రాజమౌళి వెల్లడించాడు.

దీనిపై అతడు స్పందిస్తూ.. "ప్రేక్షకులు మన పాత్రలతో, మనం సృష్టించిన ప్రపంచంతో కనెక్ట్ అవ్వకపోతే.. 3 గంటలు కాదు...