భారతదేశం, ఏప్రిల్ 28 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 589 పాయింట్లు పడి 79,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 208 పాయింట్లు కోల్పోయి 24,039 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 537 పాయింట్లు పడి 54,664 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,952.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3539.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 2,175.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22,249.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం....