భారతదేశం, ఏప్రిల్ 21 -- దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గినప్పటికీ, రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి! 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 97,743కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 9,77,430గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 9,774గా ఉంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 89,613గా కొనసాగుతోంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 8,96,130గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,961 ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతో...