భారతదేశం, మే 6 -- ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై బిగ్​ అప్డేట్​! మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థకి చెందిన షేర్లు 2శాతం ప్రీమియంతో లిస్ట్​ అయ్యాయి. ఇష్యూ ప్రైజ్​తో పోల్చితే ఎన్​ఎస్​ఈలో రూ. 328 వద్ద (2.18శాతం), బీఎస్​ఈలో రూ. 326.05 వద్ద (1.5శాతం) ఏథర్​ ఎనర్జీ షేర్లు లిస్ట్​ అయ్యాయి.

స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు, ఏథర్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ ఈ రోజు రూ .14 గా ఉన్నందున ఈ లిస్టింగ్ గ్రే మార్కెట్ సంకేతాల కంటే తక్కువగా ఉందని చెప్పుకోవాలి. గ్రే మార్కెట్​లో ఏథర్ ఎనర్జీ షేరు 4.36 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద ట్రేడ్​ అయ్యాయి. కానీ లిస్టింగ్​ మాత్రం రూ. 328 దగ్గర జరిగింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....