భారతదేశం, ఫిబ్రవరి 3 -- శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణంలో ఎదురవుతున్న భౌగోళిక సవాళ్లను అధిగమించేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు కీలక సమాచారాన్ని సేకరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన అధునాతన 'వీటీఈఎమ్' (VTEM) సర్వే నివేదికను శాస్త్రవేత్తలు ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించే అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నివేదికపై చర్చించారు.

భూగర్భ రహస్యాలను వెలికితీసిన సర్వే సొరంగం నిర్మిస్తున్న ప్రాంతంలోని భౌగోళిక స్థితిగతులు, భూగర్భంలోని 'షియర్ జోన్లు' (బలహీనమైన రాతి పొరలు), పగుళ్లకు సంబంధించిన కీలక వివరాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. "ఈ నివేదిక ఇంజనీర్లక...