భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్​ ఉగ్రదాడి కేసును ఎన్​ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ఎన్​ఐఏ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

పాకిస్థాన్ ప్రేరేపిత, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) తన ప్రాక్సీ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ద్వారా నిర్వహించిన ఈ ఉగ్రదాడి దర్యాప్తునకు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంహెచ్ఏ ఉత్తర్వులను పొందిందని, ప్రస్తుతం ఈ కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి తీసుకునే ప్రక్రియలో ఉందని అధికారులు తెలిపారు.

ఏప్రిల్​ 22న బైసారన్​ ప్రాంతంలోని పహల్గామ్​లో జరగిన ఉగ్రదాడిలో 26మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై జమ్ముకశ్మీర్​ పోలీసులు ఇప్పటికే ఎఫ్​ఐఆర్​ దాఖలు చేశారు. ఈ ఎఫ్​ఐఆర్​ని ఎన్​ఐఏ ఇప్పుడు రీ-రిజిస్టర్​ చేయనుంది. ఆ తర్వాత అధికారిక దర్యాప్తును ప్రారంభిస్తుంది.

పహ...