భారతదేశం, మే 3 -- వేసవి కాలం మధ్యలో ఉరుములు, మెరుపులతో కూడిన ఆకస్మిక వర్షాలు దేశ రాజధాని దిల్లీని ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు దిల్లీలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు చెరువులను తలపిస్తూ, అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దిల్లీవాసులకు మరో కీలక అప్డేట్​ ఇచ్చింది. శనివారం సైతం దేశ రాజధానిలో వర్షాలు కురుస్తాయంటూ యెల్లో అలర్ట్​ జారీ చేసింది.

మే 3, శనివారం దేశ రాజధాని ప్రాంతంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రానున్న వారం రోజుల్లో దేశ రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల...