భారతదేశం, ఫిబ్రవరి 9 -- ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు.. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు. కానీ, కష్టం వచ్చినప్పుడు ఆ బాధ్యత కేవలం భార్యదే కావాలని, ఆమె తన కెరీర్‌ను త్యాగం చేయాలని భర్త కోరడం ఒక నిండు సంసారంలో విడాకుల చిచ్చు పెట్టింది. ఎక్స్‌ (X) వేదికగా వైరల్ అవుతున్న ఈ కథనం ఇప్పుడు భారతీయ కుటుంబ వ్యవస్థలో లింగ వివక్ష, మహిళా స్వయంప్రతిపత్తిపై పెద్ద చర్చకు దారితీసింది.

ఈ కథనంలోని దంపతులు స్కూలు రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి బీటెక్ పూర్తి చేసి, టెక్ మహీంద్రాలో ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత కెరీర్‌లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పెళ్లి చేసుకుని, సొంతంగా ఇల్లు కొనుక్కుని, ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఆ మహిళ ఎంత కష్టపడేదంటే, తన రెండో కాన్పు సమయంలో కూడా ...