భారతదేశం, మే 12 -- పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో మే 7న భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్​ అయ్యింది. ఇక ఇప్పుడు, అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్​ ఆర్మీ అధికారుల పేర్లను భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్​ ఎలా మద్దతిస్తోందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ ఘటనతో మరోసారి రుజువైందని అంతర్జాతీయ సమాజానికి భారత్​ నొక్కిచెబుతోంది.

ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా బహవల్​పూర్​ మురిడ్కేలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారని మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్​లోని పంజాబ్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారని వివరించింది.

లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్,...