భారతదేశం, మే 14 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1282 పాయింట్లు పడి 81,148 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 346 పాయింట్లు కోల్పోయి 24,578 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 442 పాయింట్లు పడి 54,941 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 476.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,273.8 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

మే​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ 8626.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 19,463.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 కి 2...