భారతదేశం, ఏప్రిల్ 16 -- మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1578 పాయింట్లు పెరిగి 76,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 500 పాయింట్లు వృద్ధిచెంది 23,329 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 1377 పాయింట్లు పెరిగి 52,379 వద్దకు చేరింది.

ఈ నేపథ్యంలో నేటి స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,065.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,951.60 కోట్లు విలువ చేసే విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 23,300 కన్నా ఎగువన ముగియడం బుల్స్​ బలాన్ని సూచిస్తోంది. ఇక్కడి ను...