భారతదేశం, మే 6 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 295 పాయింట్లు పెరిగి 80,797 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 114 పాయింట్లు వృద్ధిచెంది 24,461 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 196 పాయింట్లు పడి 54,919 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 497.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,788.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 24,200- 25,500 లెవల్స్​ మధ్యలో ట్రేడ్​ అవుతోంది. 24,200- 24,250 దగ్గర సపోర్ట్​, 24,500- 24,550 దగ్గర రెసిస్టెన్స్​లు కనిపిస్తున్నాయి. వీటిలో ఏద...