భారతదేశం, మే 5 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 260 పాయింట్లు పెరిగి 80,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు వృద్ధిచెంది 24,347 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 55,115 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,769.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,290.49 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 24,200 లెవల్​ కీలక సపోర్ట్​ జోన్​గా మారింది. ఇక్కడ సస్టైన్​ అయితే 24,600- 24,800 వరకు వెళ్లొచ్చు. 24,200 దిగువకు పడితే మాత్రం 24,050 వరకు నిఫ...