భారతదేశం, మే 20 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 271 పాయింట్లు పడి 82,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 74 పాయింట్లు కోల్పోయి 24,945 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 55,421 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 525.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 237.93 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ-50 ఇండెక్స్ 25,000 స్థాయిని తిరిగి చేరుకోకపోతే ఒత్తిడిలో ఉండవచ్చు. నిఫ్టీ 24,800-24,750 జోన్ వైపు పయనించవచ్చు. 24,750 దిగువకు పడిపోతే మరింత లోతైన దిద్దు...