భారతదేశం, ఆగస్టు 18 -- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 58 పాయింట్లు పెరిగి 80,598 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 12 పాయింట్లు వృద్ధిచెంది 24,631 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 55,342 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,889.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3700.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఆగస్ట్​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 21,486.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 49,993.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన...