భారతదేశం, మే 26 -- తెలంగాణలో జూన్‌ 2వ తేదీన సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతోంది. ఈ క్రమంలో జూన్‌2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు జూన్‌ 2న వాటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. జూన్ 2న నిర్మాణం పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూన్‌2 వ తేదీకి మరో వారం రోజులే ఉండటంతో శ్లాబ్ పూర్తై, గోడలు పూర్తి చేసుకుని, ఫ్లోరింగ్‌, ప్లాస్టింగ్‌ పూర్తై తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక్కో...