భారతదేశం, మే 4 -- ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ దుకాణదారుడిపై ఓ 15ఏళ్ల బాలిక బ్లేడ్​తో దాడి చేసింది! అతని షాప్​లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు వెళితే, వాటిని తీసుకోవడం లేదన్న కోపంతో బాలిక ఈ దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు షాప్​లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

యూపీ హాపూర్​ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది ఈ ఘటన. స్థానిక దుకాణం నుంచి బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుంది. అయితే, బాలిక చాలా కాలంగా వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని, ఎటువంటి ప్రతిఘటన లేకుండా అనేకమార్లు వాటిని వెనక్కి తీసుకున్నానని దుకాణదారుడు చెప్పాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించాడు.

ఆగ్రహించిన బాలిక మొ...