భారతదేశం, అక్టోబర్ 13 -- పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న ఈ కాలంలో, ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్పృహతో కూడిన డ్రైవింగ్ ప్రధానం కావడంతో, భారతీయ వినియోగదారులకు హైబ్రీడ్ వాహనాలు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక ఆప్షన్లలో, మూడు హైబ్రీడ్ ఎస్‌యూవీలు.. వాటి ధర, పనితీరు, ఫీచర్ల పరంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవి: మారుతీ సుజుకీ విక్టోరిస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్.

ఈ మూడు మోడళ్లు రూ. 17 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో పర్యావరణహితమైన వాహనాలకు మారాలనుకునే వారికి ఇవి సరైన ఎంపిక! ఈ మూడు హైబ్రీడ్ ఎస్‌యూవీల పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి:

ధర: రూ. 16.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)

మైలేజీ: 28.65 కి.మీ./లీ (ARAI ధృవీకరణ)

ఇంజిన్: 1.5 లీటర్ పెట్రోల్ ...