భారతదేశం, ఆగస్టు 18 -- వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్ఫాస్ట్.. భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో గణనీయమైన వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వీఎఫ్6, వీఎఫ్7 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా.. 'లిమో గ్రీన్', 'మినియో గ్రీన్' అనే రెండు ఎలక్ట్రిక్ కార్లకు భారత్లో పేటెంట్ హక్కులను పొందింది. ఆ వివరాలు..
విన్ఫాస్ట్ ఇప్పటికే 'మినియో గ్రీన్' కోసం పేటెంట్ అప్లికేషన్ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత చిన్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీకి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ 3,100 మిల్లీమీటర్ల పొడవుతో ఎంజీ కామెట్ కంటే కొద్దిగా పొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.