భారతదేశం, ఏప్రిల్ 30 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ నుంచి ఆందోళనకర వార్త బయటకు వచ్చిది. గతేడాడి డిసెంబర్​ నుంచి నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) దాటి భారత్​లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని అధికారులు వెల్లడించారు. భారత్​లోకి చొరబడి మూడు రకాల దాడులు (కాల్పుల ఘటనలు, బోర్డర్​ యాక్షన్​ టీమ్​ ఆపరేషన్లు, ఐఈడీ పేలుళ్లు) చేసేందుకు డిసెంబర్​ నుంచి ప్రతి నెల కనీసం 120 మంది టెర్రరిస్ట్​లు ఎల్​ఓసీ దగ్గర గుమిగూడారని పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబరులో 167 మంది ఉగ్రవాదులు, ఈ ఏడాది జనవరిలో 146 మంది, ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో 122 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు చూశారని నిఘా వర్గాల సమాచారం మేరకు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇవే నెలల్లో సగటున 40-50 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న 26 మందిన...