భారతదేశం, ఫిబ్రవరి 1 -- బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం తన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో' (O Romeo) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రఖర్ గుప్తా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న షాహిద్ కపూర్ ప్రస్తుతం తన సొంత సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులపై మనసులోని అసహనాన్ని బయటపెట్టారు.

ముఖ్యంగా 'కృత్రిమ ప్రచారం' (Manufactured Marketing) వల్ల సినిమాకు జరిగే నష్టం గురించి షాహిద్ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఆర్టిఫీషియల్ పీఆర్‌పై తనకు ఎప్పుడూ నమ్మకం లేదని షాహిద్ స్పష్టం చేశారు. "ఒక హాల్ నిండా ఉన్న ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ మనల్ని అభినందించడం అనేది ఒక అద్భుతం. కళకు ఉన్న ప్రత్యేకత అదే. కానీ, ఎప్పుడైతే మనం కృత్రిమమైన మార్కెటింగ్ పద్ధతులతో ఆ స్వచ్ఛతన...