భారతదేశం, ఫిబ్రవరి 14 -- కేరళ థ్రిస్సూర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచసుకుంది. ఓ ఆలయ ఉత్సవాల్లో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 30మందికి గాయాలయ్యాయి.
కోయిలండి కురువాంకడులోని మనకులంగర ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోకి ఏనుగులను తీసుకొచ్చారు. అయితే, ఏనుగులకు సమీపంలోనే బాణాసంచా పేల్చడం మొదలుపెట్టారు. టపాసుల ఆ శబ్దాలను ఏనుగులను భరించలేకపోయాయి. ఒక ఏనుగు మరో ఏనుగు మీదపడింది. ఆ తర్వాత రెండు ఏనుగులు పరుగులు తీశాయి.
ఏనుగల నుంచి తప్పించుకునేందుకు ఆలయంలోని ప్రజలు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఫలితంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. వారు.. 65ఏళ్ల లీల, 70ఏళ్ల అమ్ముకుట్టి అమ్మ, రంజన్. ఇదే ఘటనలో మరో 30మంది గాయపడ్డారు.
కాగా ఈ ఘటనపై స్పందించిన మావటి.. ఏనుగులను అదుపు చేశారు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.