భారతదేశం, మే 7 -- మీడియా బ్రీఫింగ్​ జరుగుతోంది.

లష్కర్‌ తోయిబా అనుబంధ భారతీయ పర్యాటకులపై దాడులు చేసి 25మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడిని కాల్చి చంపారు.

ఏప్రిల్ 22న పాకిస్థా, పాక్​ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్ర దాడికి పాల్పడ్డారు. పహల్గామ్‌లో జరిగిన దాడి అత్యంత పాశవికమైనది. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడులతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత ఏడాది 22లక్షల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలో మత కల్లోలాలను సృష్టించే లక్ష్యంతో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఈ దాడుల వెనుక ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ది కార్యక్రమాలను నిరోధించే లక్ష్యంతో ఉగ్రదాడ...