భారతదేశం, మే 17 -- ఏప్రిల్​లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి​ ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మే 9-10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్​కి సంబంధించిన కీలక విషయాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్​ని భారత వాయుసేన తెలివిగా బోల్తా కొట్టించిన ఒక ఘటనకు సంబంధించిన వార్త వైరల్​గా మారింది. ఐఏఎఫ్​ ముందు ఒక డమ్మీ విమానాన్ని పంపి, పాక్​కి చెందిన కీలక మిసైల్​ వ్యవస్థల లొకేషన్​లు పసిగట్టింది. ఆ తర్వాత వాటిపై దాడి చేసిందట!

ఈ ఘటనకు సంబంధించి రక్షణశాఖ వర్గాలు మీడియాకు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా మే 9-10 అర్థరాత్రి వేళ 11 పాకిస్థానీ ఎయిర్​ బేస్​లపై మిసైల్స్​తో భారత్​ దాడి చేసింది. అయితే, మిసైల్స్​ లాంచ్​ చేసే ముందు యుద్ధ విమానాన్ని పోలి ఉండే విధంగా ఒక డమ్మీ విమానాన్ని గాల్లోకి ప...