భారతదేశం, మే 7 -- పహల్గామ్​ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇక్కడ హైలైట్​ విషయం ఏంటంటే.. "రెడీ టు స్ట్రైక్​," అంటూ భారత సైన్యం ఈ దాడులకు ముందు ఒక ట్వీట్​ చేయడం. అంటే.. భారత సైన్యం చెప్పి మరీ చేసింది!

మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్​లో ఒక వీడియోతో కూడిన ట్వీట్​ చేసింది ఇండియన్​ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్​, ట్రైన్డ్​ టు విన్​' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే) అంటూ క్యాప్షన్​ ఇచ్చింది.

ఈ వీడియోలో భారత సైనికులు ఆయుధాలను లోడ్​ చేస్తుండటం కనిపిస్తోంది. ట్యాంకర్లు దూసుకెళ్లడాన్ని మనం చూడవచ్చు. "నా సోదరుడు- సోదరీమణుల బాధ నిన్ను వెంటాడుతుంది," అని బ్యాక్​గ్రౌండ్​లో ఒక వాయిస్​ వినిపిస్తుంది. "నిరంతరం సిద్ధం, నిరంతరం విజయం," అన్...