New Delhi, జూన్ 6 -- నీట్-పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్ లో నిర్వహించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. నీట్ పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్బీఈఎంఎస్ ని ఆదేశించిన విషయం తెలిసిందే.

నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు పైగా సమయం కావాలని ఎన్బీఈఎంఎస్ సుప్రీంకోర్టును కోరింది. ఈ అభ్యర్థనను మొదట ప్రశ్నించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం, ఆ తరువాత ఎన్బీఈఎంఎస్ అభ్యర్థనను అంగీకరించింది. ఆగస్టు 3న నీట్-పీజీ 2025 నిర్వహించడానికి ఎన్బీఈఎంఎస్ పేర్కొన్న కారణాలు సరైనవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది.

అయితే నీట్-పీజీ 2025 పరీక్ష నిర్వహణకు ఎన్బీఈఎంఎస్ కు మరింత సమయం ఇవ్వలేమని సుప్రీ...