భారతదేశం, ఏప్రిల్ 28 -- ఒడిశాలో దారుణ, అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 4ఏళ్ల చిన్నారిపై ఓ 27ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి దూరపు బంధువు అయిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012లోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు గంజాం పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సువేందు పాత్ర తెలిపారు.

తొలుత అతను చిన్నారికి చాక్లెట్ ఇచ్చాడు. అనంతరం తమ గ్రామంలోని ఓ పండుగకు తీసుకెళతానని మాయమాటలు చెప్పాడు. కానీ ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని పడేశాడు.

నేరానికి పాల్పడుతున్న సమయంలో ...