భారతదేశం, ఏప్రిల్ 16 -- భూకంపంతో అఫ్గానిస్థాన్​ మరోసారి ఉలిక్కిపడింది. రిక్టార్​ స్కేల్​పై 5.6 తీవ్రతతో అఫ్గానిస్థాన్​లో బుధవారం భూకంపం సంభవించింది. ఆ తర్వాత దిల్లీ-ఎన్​సీఆర్​లో కూడా ప్రకంపనలు సంభవించాయని సోషల్ మీడియా యూజర్లు ఎక్స్​లో పేర్కొన్నారు.

అఫ్గాన్​లోని బాగ్లాన్​ నగరానికి తూర్పున 164 కిలోమీటర్ల దూరంలో, భూమికి 121 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు నమోదైనట్టు యూరోపియన్-మెడిటరేనియన్​ భూకంప కేంద్రం (ఈఎంఎస్​సీ) వెల్లడించింది.

భూకంపం తీవ్రత తొలుత 6.4గా నమోదైనట్లు ప్రకటించిన ఈఎంఎస్​సీ ఆ తర్వాత దానిని 5.6కు సవరించింది.

కాగా భూకంపం వల్ల ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అఫ్గానిస్థాన్​ భూకంపంలో ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.

అటు దిల్లీ ఎన్​సీఆర్​లోనూ భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.

"దిల్లీలో భూకంపాన్ని ఎవరైనా ఎక్స్​పీరి...