భారతదేశం, ఏప్రిల్ 30 -- అక్షయ తృతీయ వేళ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 460 పెరిగి.. రూ. 98,153కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4600 పెరిగి, రూ. 9,81,530కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,815గా కొనసాగుతోంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 420 వృద్ధి చెంది.. రూ. 89,983కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 4200 పెరిగి.. రూ. 8,99,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు పెరిగాయి. దేశ కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,835గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,005గా ఉంది. దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,983 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 98,153గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర...