భారతదేశం, ఫిబ్రవరి 1 -- Ys Sharmila Security: పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు వారాల్లోనే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోదరుడు జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వర్గానికి, వైసీపీకి నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో షర్మిలపై ముప్పెట దాడి జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను వదిలేసి వైసీపీ పూర్తి స్థాయిలో షర్మిలను టార్గెట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల రోజుకో రకంగా వైసీపీ అధ్యక్షుడికి ప్రశ్నలు సంధిస్తున్నారు.

షర్మిల తీరును వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆమెను ఎదుర్కొనే క్రమంలో సోషల్...