భారతదేశం, ఫిబ్రవరి 4 -- Visakha Mahakumbh Trains : మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను తూర్పుకోస్ట్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం- గోరఖ్‌పూర్- విశాఖపట్నం మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను న‌డ‌ప‌డానికి నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు తూర్పు కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.

రైలు నెంబ‌ర్ 08588 విశాఖపట్నం- గోరఖ్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 4 (మంగ‌ళ‌వారం)తేదీన రాత్రి 10:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవ‌రి 6 (గురువారం) తేదీన‌ రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.

రైలు నెంబ‌ర్ 08587 గోరఖ్‌పూర్-విశాఖపట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవ‌రి 7 (శుక్రవారం) తేదీన‌ సాయంత్రం 5.45 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవ‌రి 9 (ఆదివారం) మ‌ధ్యాహ్నం 3.55 గంటలకు...