భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వాటిని విస్తరించడానికి రాయితీతో రుణాలు పొందవచ్చు.

లక్ష్యం- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం.

లబ్ధిదారులు- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత.

ప్రయోజనాలు- స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.4 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తారు. రుణాలపై 60 నుండి 80 శాతం వరకు సబ్సిడీ (రుణ వర్గం ఆధారంగా) ఉంటుంది.

లక్ష రూపాయల వరకు రుణం - 80 శాతం సబ్సిడీ ఉంటుంది. మిగిలిన...