భారతదేశం, మార్చి 17 -- తెలంగాణలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌.. (పీజీఈసెట్‌)-2025 గురించి మరో అప్‌డేట్ వచ్చింది. పీజీఈసెట్‌-2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ (మార్చి 17న) ప్రారంభం కానుంది. ఇటీవలే పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించనుంది.

అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మే 19 వరకు pgecet.tgche.ac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించినట్లయితే.. వారు జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు జూన్ 16 నుంచి 19 వరకు జరుగుతాయి. హాల్ టిక్కెట్లను జూన్ 7న విడుదల చేస్తారు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు హాజరు కావాలనుకుంటే.. దానికి అనుగుణంగా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజు...