భారతదేశం, ఫిబ్రవరి 11 -- మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. ఈ సమయంలోపు క్యూ లైన్లలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీన ఉంటుంది.

పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలవురు ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు. ఆయా మున్సిపాలిటిల్లో ఓటు వేశారు.

బోధన్ పట్టణ...