భారతదేశం, ఫిబ్రవరి 28 -- తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. దీంతో పార్టీ సీనియర్ నేతలంతా ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వారిలో అగ్రకులాలకు చెందిన నాయకులు ఎక్కువమంది ఉన్నారనే టాక్ ఉంది. వారు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలోని బీసీ లీడర్లు ఆలర్ట్ అయ్యారు. సామాజిక సమీకరణాల ఆధారంగానే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కులగణన చేయడంతో బీసీల లెక్కలు తేలాయని అంటున్నారు. బీసీలు 56 శాతం ఉండడంతో.. ఆ ప్రాతిపదికనే సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. అంజన్ కుమార్ యాదవ్, తీన్మార్ మల్లన్న వంటి నేతలు స్వరం పెంచి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.