భారతదేశం, ఫిబ్రవరి 20 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫైన్ తో అయితే. మే 2 వరకు అవకాశం కల్పించారు.

టీజీ ఈఏపీసెట్ - 2026కి సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. తాజాగా మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులతో పాటు ఫార్మసీ - అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం వేర్వురుగా వీటిని వెబ్ సైట్ లో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఉచితంగా రాసుకోవచ్చు.

టీజీ EAPCET -2026 పరీక్షల నిర్వహణ తేదీలు చూస్తే.. మే 4, మే 5న అగ్రికల...