తెలంగాణ,హైదరాబాద్, నవంబర్ 27 -- Telangana Congress Latest News: తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల ఎర కేసు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మారింది. పలువురు కీలక నేతలు కూడా పార్టీలు మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మక్కాం వేయటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్య నేతల రాజీనామాలు, అసంతృప్తుల నేపథ్యంలో రేవంత్ టూర్ పై అనేక విశ్లేషణలు వస్తున్నాయి.

పీసీసీ కార్యవర్గం, డీసీసీల మార్పులుపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి జంబో కార్యవర్గం ఉండటంతో పాటు ప్రధాన కార్యదర్శలను పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన కార్యదర్శలకు నియోజవర్గాల బాధ్యతలను అప్పగించే అవకాశాలపై కూడా చర్చకు...