తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్ భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ముందుగా.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.

"అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వ ధ్యేయం, దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోంది. వరి రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ క్రీడా యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేశాం" అని గవర్నర్ తన ప్రసంగంలో చదవి వినిపించారు.

"రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రుణమా...