భారతదేశం, ఏప్రిల్ 7 -- ఓదెల 2 మూవీపై చాలా క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ సినిమాలో నాగసాధువు పాత్ర పోషించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ టీజర్ ఆసక్తిని పెంచేసేంది. నాలుగేళ్ల క్రితం ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్‍కు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. ఓదెల 2 మాత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు కథను అందించిన డైరెక్టర్ సంపది నంది.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఓదెల 2 సినిమాకు బిజినెస్ బాగా జరిగింది.

ఓదెల 2 సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ పతాకాలపై డి.మధు, సంపత్ నంది నిర్మించారు. ఈ చిత్రానికి సుమారు రూ.25కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమాకు ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, ఆడియో హక్కుల ద్వారానే సుమారు రూ.18కోట్లు దక్కాయి. తాజాగా ఈ ఓదెల 2 సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ.1...