భారతదేశం, ఫిబ్రవరి 20 -- Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ నిఫ్టీ 282 పాయింట్లు పెరిగి 72,708 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 82 పాయింట్ల లాభంతో 22,122 రికార్డ్​ స్థాయికి చేరింది. ఇక 151 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 46535 వద్ద ముగిసింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. దేశీయ సూచీలు అప్​ట్రెండ్​లో కొనసాగుతున్నాయి.

Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 754.59 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 452.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

సోమవారం నాడు ...