భారతదేశం, ఏప్రిల్ 16 -- Stocks to buy today : ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 845 పాయింట్లు కోల్పోయి 73,400 వద్ద స్థిపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 247 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద ముగిసింది. ఇక 791 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 47,773 వద్దకు చేరింది.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు శాంతించేంత వరకు.. దేశీయ స్టాక్​ మార్కెట్​లతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లలో అనిశ్చితి, ఒదుడొకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రేడర్లు, మదుపర్లు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,268 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4762.93 కోట్లు విలువ చేసే షేర్లను ...