భారతదేశం, ఫిబ్రవరి 19 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 283 పాయింట్లు పెరిగి 83,734 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 93 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 377 పాయింట్లు పెరిగి 61,551 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,125.01 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 360.76 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ సపోర్ట్​ అనేది 25,500 నుంచి 25,600కి వెళ్లింది. దానిపైన కొనసాగినంత వరకు నిఫ్టీ50 పాజిటివ్​గా ఉన్నట్...