ఆంధ్రప్రదేశ్‌, డిసెంబర్ 6 -- Skill Development Scam ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ‍యన తనయుడు లోకేష్‌ల పాత్ర ఉంటుందనే ఆరోపణలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆగస్ట్ 2021లో అంతా సక్రమంగా ఉందని కాలేజీ యాజమాన్యాలు లేఖలు రాస్తే సీఐడీ డిసెంబర్,2021 లో కేసు ఎలానమోదుచేసిందని ప్రశ్నిస్తున్నారు.

కొన్నిలక్షలమంది విద్యార్థుల జీవితాల్ని బాగుచేసిన ప్రాజెక్ట్ పై కడుపుమంట దేనికని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2 లక్షల పైచిలుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరుని చూసి, సంతోషంగా ఉంటున్న యువతను చూసి ఓర్వలేక, సిఎం జేబు సంస్థ సీఐడీని విచారణ పేరుతో ఉసిగొల్...