ఆంధ్రప్రదేశ్,విజయవాడ, ఫిబ్రవరి 14 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. నాలుగు స్పెష‌ల్ వీక్లీ రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్ర‌యాణికులు ర‌ద్దీని త‌గ్గించేందుకు విజ‌య‌వాడ మీదుగా చ‌ర్ల‌పల్లి-కాకినాడ టౌన్, చ‌ర్ల‌ప‌ల్లి-న‌ర్సాపూర్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ వీక్లీ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

1. చ‌ర్ల‌ప‌ల్లి- కాకినాడ (07031) స్పెష‌ల్ వీక్లీ రైలు ఈనెల 14, 21 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.20 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లిలో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 4.30 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

2. కాకినాడ టౌన్‌- చ‌ర్ల‌ప‌ల్లి (07032) స్పెష‌ల్ వీక్లీ రైలు ఈనెల 16, 23 తేదీల్లో అందుబాటు ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 6.55 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌లో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ...