భారతదేశం, మార్చి 11 -- హైదరాబాద్కు చెందిన రోబోటిక్స్ కంపెనీ బృందం ఒక రోబోతో కలిసి సొరంగంలోకి ప్రవేశించింది. మంగళవారం ఉదయం రోబోతో 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా సొరంగంలోకి వెళ్లారు. సొరంగం లోపల నీరు, బురద పరిస్థితులు సవాలుగా మారాయి. దీంతో రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను మోహరించాలని నిర్ణయించింది.
రోబో నిపుణుల సేవలను ఉపయోగించి ఆపరేషన్ చేపట్టడానికి ప్రభుత్వం రూ.4కోట్లు ఖర్చు చేస్తుందని.. రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 8న వెల్లడించారు. భారీ టన్నెల్ బోరింగ్ మెషిన్ శకలాలు నీటిలో మునిగిపోయాయి. సొరంగం లోపల మట్టి, రాళ్లు రెస్క్యూ బృందానికి ప్రమాదం కలిగించాయని ఆయన చెప్పారు.
మార్చి 2న సొరంగంను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అవసరమైతే సొరంగం లోపల రోబోలను ఉపయోగించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.